Monday, May 31, 2010

My Fathers Retirement

Vemuri Visveswara Rao, every one know this name in my native place. People know him as a teacher, good talker, good organiser, good speaker and many with many shades. He is none other than my Father.

He retired from his service today. Along with everyone i also surprise he is retiring today???? reason behind is, he never think that he became old and even today he is not interested to sit idle. He is great father, he is good friend and he is Guide for me.

I am happy that he completed his service without any remarks though he is actively participated in politics from back end. I am happy he achieved lot of achievements may be no one can beat that in near future like continues 4 times winners in district volley ball captain, whatever the school he works especially the section in which he teach created records in almost every year results.

Hope no one forget his services on the school wherever he worked. He always says "My house doors are always open for the good purpose", i hate to do some thing bad to anyone. Give shake hand to the fellow you hate or the fellows who hate you"

He is the man who achieved a lot and never accepted any awards that offered many time. Even he is not interested to do his retirement function...

All the Best Dad, Hope you continue with same spirit with good health & wealth. Go on and on...

Friday, May 21, 2010

మొన్న ఫేస్‌బుక్.. నిన్న యూట్యూబ్.. నేడు ట్విట్టర్‌

మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకరమైన క్యారీకేచర్‌లు ప్రచురించినందుకు మొన్న.. ఫేస్‌బుక్, నిన్న.. యూ ట్యూబ్‌లపై నిషేధం విధించిన పాకిస్థాన్ సర్కారు నేడు (శుక్రవారం) ట్విట్టర్‌పై నిషేధిం విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ సమాచార శాఖ వెల్లడించింది. ఈ శాఖ ఆదేశాల మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ సంస్థలు ట్విట్టర్‌ సైట్‌ను బ్లాక్ చేశాయి. దీంతో పాకిస్థాన్ నెటిజన్లు యాక్సెస్ చేయలేక పోతున్నారు. ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లిన నెటిజన్లు ట్విట్టర్ బ్లాగును ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా, ఈ 'సైటు నిషేధించబడింది' అనే సమాచారాన్ని వారు పొందుతున్నారు.

మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకరమైన సమాచారాన్ని, క్యారీకేచర్లను పొందుపరిచారంటూ గత రెండు రోజులుగా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌తో పాటు.. వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూ ట్యూబ్‌లపై పాకిస్థాన్ టెలీ కమ్యూనికేషన్ శాఖ కొరడా ఝుళిపించిన విషయం తెల్సిందే. లాహోర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ శాఖ ఈ తరహా చర్యలు చేపట్టింది.

దీనిపై పాకిస్థాన్ టెలీ కమ్యూనికేషన్ అథారీటీ అధికారులు స్పందిస్తూ.. అభ్యంతకర వీడియోలు, సమాచారం ఉండటంతో యూట్యూబ్‌ను నిషేధించినట్టు చెప్పారు. అయితే, ఎలాంటి సమాచారాన్ని పొందుపరిచిందో శాఖ వెల్లడించలేదు. ఇపుడు తాజాగా ట్విట్టర్‌పై కూడా ఇదే తరహా చర్య చేపట్టింది. అయితే, ఈ చర్యకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదన్నారు.

Sunday, March 14, 2010

Nation vs regionalism

NDTV debates whether Andhra Pradesh can return from the brink of chaos, and ask whether small states are bad for a strong nation.


http://www.nyootv.com/watch/Entertainment/Nation-vs-regionalism/2799-0-16

Thursday, March 11, 2010

హైదరా"భాగో".. వై"జాగో": విశాఖలో విశాల అవకాశాలు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తన ప్రాభవాన్ని మెల్లగా కోల్పోతోంది. ఐటీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిగడించిన ఈ నగరంపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పుణ్యమాని రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలు ఈ నగరానికి ముఖం చాటేస్తున్నాయి. ఫలితంగా ఒకపుడు ఎంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన భాగ్యనగరం.. ప్రస్తుతం ఉపాధి అవకాశాల కల్పనలో అట్టడుగు స్థాయికి పడిపోయే ప్రమాదం పొంచివుంది.

అదేసమయంలో ఓడరేవు నగరంగా పేరుగాంచిన విశాఖపట్టణం ఇకపై రాష్ట్ర ఐటీ హబ్‌గా అవతరించనుంది. ఇది సీమాంధ్ర ప్రాంత యువతీ యువకులకే కాకుండా తెలంగాణ ప్రాంత యువకులకు కూడా ఓ శుభవార్తలాంటిందే. మాఫోయ్ అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజాగా సర్వేలో ఈ హైదరాబాద్ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించింది.ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోతున్నట్టు ఈ సర్వే తేల్చింది. అదేసమయంలో అంతర్జాతీయ ఐటీ కంపెనీలన్నీ విశాఖ నగరంపై దృష్టి సారించినట్టు పేర్కొంది. దీన్ని నిజం చేసేలా ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఐబీఎం వైజాగ్‌లో "గ్లోబెల్ సెంటర్‌"ను నెలకొల్పే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, రవాణా, తదితర అంశాలపై ఐబీఎం‌కు చెందిన 12 మంది నిపుణుల కమిటీ వైజాగ్‌లో పర్యటిస్తూ అధ్యయనం చేస్తోంది. ఈ బృందం ఆంధ్రా వర్శిటీ ప్రొఫెసర్లు, ఇతర నిపుణులతో కూడా సమావేశమై సమీక్ష నిర్వహిస్తుంది. పైపెచ్చు.. హైదరాబాద్‌తో పోల్చితే వైజాగ్‌లో ఉద్యోగస్తులను తక్కువ జీత భత్యాలకు ఎంపిక చేసుకోవచ్చనే భావన ఐటీ కంపెనీలకు ఏర్పడింది. దీంతో ఐబీఎం గ్లోబెల్ సెంటర్‌ ఏర్పాటుకు ఎక్కువగా మొగ్గు చూపుతోంది.

దీనికి తోడు.. ఇట్టే ఆకర్షించే సముద్ర తీర ప్రాంతం, కనువిందు చేసే రిషికొండలు, అరకు వంటి పర్యాటక ప్రాంతాలు వైజాగ్‌‌కు మరింత పర్యాటకట శోభను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పోల్చుకుంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకపోవడం అంతర్జాతీయ కంపెనీలను ఎంతగానో ఆకర్షిస్తోంది. అలాగే, భాగ్యనగరం కంటే వైజాగ్ ఎంతో ప్రశాంతమైన నగరంగా పేరుగడించింది. ఇప్పటి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన దాఖలాలు లేవు. అదే హైదరాబాద్ విషయానికి వస్తే హిందు-ముస్లిం అల్లర్లు, తెలంగాణ ఉద్యమం, గూండాయిజం, భూకబ్జా ఇలా అనేక సమస్యల ఉన్నాయి. అలాగే వైజాగ్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్‌ హైదరాబాద్‌తో పోల్చితే చాలా తక్కువ. పైపెచ్చు భూముల ధరలు కూడా చౌకే. ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో వందలాది ఎకరాలు ఇక్కడ ఉన్నాయి.

ఇక్కడ పరిశ్రమలు స్థాపించే కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. ఒక్క రిషి కొండలోనే 20 సెజ్ కంపెనీలు అనుమతి పొందగా, వీటిలో 12 కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే విద్యాశాతంతో పోల్చితే హైదరాబాద్ కంటే వైజాగ్ ప్రజలు ఎక్కువ విద్యావంతులు కావడం గమనార్హం.

ఇదిలావుండగా, వచ్చే మూడేళ్ళలో దేశ వ్యాప్తంగా పది లక్షల ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 20 నుంచి 25 వేల ఉద్యోగాలు ఒక్క వైజాగ్ నగరంలో అందుబాటులో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద తెరాస అధినేత కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమం పుణ్యమాని హైదరాబాద్ నగరం తన శోభను కోల్పోతుండగా, వైజాగ్‌లో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

Wednesday, February 3, 2010

ఛానళ్ల "క్రియేటివ్" న్యూస్ స్టోరీస్...

నేటి ఎలక్ట్రానిక్ మీడియాపై మనకే నవ్వు వస్తుంది. మరికొందరికి ఎంతగా దిగజారిపోయామో అనిపిస్తుంది. ఇంకా స్వాతంత్ర్యసమరయోధులకైతే.. హతవిధీ... ఎంతగా విలువలు పడిపోయాయో అనిపిస్తుంది. ఇది ఒకరోజు కాదు. రెండు రోజులు కాదు.. ఎన్నో రోజులుగా ప్రజల మనస్సులతో ఆడుకుంటున్న ఛానళ్ల వ్యవస్థకు దర్పణం.

చాలా సినిమాల్లో మీడియాపై రకరకాల సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అవన్నీ హాస్యం కోసమే అన్నట్లు చోద్యం చూస్తూనే ఉన్నారు. కానీ ఛానళ్ల తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది..? దీనికి బాధ్యులెవరు? అనేదానికి ప్రభుత్వ యంత్రాంగమే సమాధానం చెప్పాలి.

దేశంలో ఎక్కడా లేనటువంటి ఛానళ్లు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా వస్తున్నా వాటికి పర్మిషన్లు ఇచ్చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. పర్మిషన్‌కోసం పైరవీలు... కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఉద్యోగులకు వేలాది జీతాలు పెంచేస్తున్నారు. క్రియేటివ్ హెడ్ జీతమైతే లక్ష రూపాయల వరకూ ఉంటుంది. ఆ మధ్య ఓ ఛానల్‌లో అసిస్టెంట్ క్రియేటివ్ హెడ్ పోస్ట్ వేసి దానికి మరో లక్ష అదనంగా ఇవ్వడం ప్రారంభించారు. ఆ క్రియేషన్ చూస్తే ఆశ్చర్యమేస్తుంది.

ప్రధానంగా సినిమా వార్తలో బాలీవుడ్, టాలీవుడ్ న్యూస్‌తో పాటు గాసిప్స్ కూడా ప్రారంభించారు. అందులో మార్నింగ్ ఫోటోలు పెట్టేసి.. ఫలానా తార ఫలానా వారితో ఇలా తిరిగింది... డాన్స్ చేసింది... అనేది సారాంశం. ఇలా ఒక్కటి కాదు... రోజూ రాత్రిపూట ఒక్కో ఛానల్‌ది ఒక్కో శైలి. ఇలియానా గోవా బీచ్‌కు వెళితే.. అంతకుముందు నటించిన దేవదాసులోని ఎక్స్‌పోజింగ్ సీన్స్ చూపించి ఇంతగా అక్కడి జనాలను ఆహ్లాదపరుస్తోందంటూ... కథనాలు చెప్పడం. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని.

అసలు మీడియా అనేది ఎలా ఉండాలి. ఎలాంటివి ప్రసారం చేయాలి..? దానికి పరిమితులు ఏమిటి..? అనేవి తెలీని వారు కూడా జర్నలిజంలో రాణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు జర్నలిజం అంటే గౌరవప్రదంగా భావించేవారు. ఫోర్త్ ఎస్టేట్‌గా ప్రభుత్వం ఒక సుస్థిర స్థానాన్ని ఇచ్చింది. కాలక్రమేణా విలువలు దిగజారుతున్నాయి. ఏది నిజం.. ఏది అసత్యం.. అనేది ఆలోచించకుండా పోటీ తత్త్వంతో ముందుకు సాగుతున్నాయి. వేసిన వార్తనే వేస్తూ.. కాస్త బ్రేక్ ఇస్తూ.. నిరంతరం చూస్తూనే ఉండండి... అంటూ వీక్షకుల మనస్సు మరల్చకుండా చేస్తున్నాయి. దీనికి వీక్షకుడు బానిస అవుతున్నాడు.

ప్రయోజనం లేని వార్త అయినా మనమెందుకు చూడాలి... మన పనులను మానుకుని చూడాలా..? అని ఆలోచించే దశను దాటిపోయారు. ఈ ప్రభావం బంధుమిత్రుల ఆప్యాయత అనురాగాలపై కూడా పడుతోంది. చుట్టం చూపుగా ఎవరైనా వస్తే... టీవీ చూస్తూనే ఉంటారు. ఏదో మిస్సయినట్లుగా దాన్నే చూస్తూ.. ఏదో గుడ్డిగా పలుకరించే దుస్థితికి మానవుడు వచ్చేశాడు.

టీవీ వల్ల జ్ఞానం పెరుగుతుంది. ఎలాగా...? మంచి విజ్ఞాన కార్యక్రమాలు ప్రదర్శిస్తే.. అవి తగ్గిపోయి అజ్ఞానాన్ని, ఊహాజనితమైన వాటిని ప్రదర్శిస్తూ... కోట్లు గడిస్తున్న ఆయా యాజమాన్యాలు ప్రజలను నిస్సహాయులుగా చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రింట్ మీడియా రాజ్యమేలుతున్న దశలో స్వాతంత్ర్య పోరాటాలు ఆ మరుసటి నాడే ప్రపంచానికి తెలిసేవి. రేడియోలు ఉండేవి. అవి వినడానికి గ్రంధాలయాలకు వెళ్లి మరీ వినివచ్చేవారు. కాలక్రమేణా మార్పులతో విజ్ఞానం మారి అరచేతిలోకి వచ్చేసింది. దీన్ని వ్యాపారం చేసే యాజమాన్యం రకరకాలుగా ప్రజలను మభ్య పెడుతూ మోసం చేస్తోంది.

ఏదైనా ఒక సంఘటన తీసుకుంటే.. తెలంగాణా, సమైక్యాంధ్ర పోరాటాల్లో... చిన్నపాటి సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ... వారికి వారికి మధ్య చర్చపెట్టి చిచ్చు రేపుతున్నాయి. దేనికైనా సమయం రావాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లుంది... వైఎస్ మృతిపై అనుమానం ఉందని ఏదో రష్యా వెబ్‌సైట్ రాస్తే... దాన్ని ప్రధానంగా చూపి రాష్ట్రంలో అలజడులు సృష్టించాయి కొన్ని ఛానళ్లు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేకంటే... ఇలాంటివి ప్రసారం చేసిన ఛానళ్లపై కఠిన వైఖరి ప్రదర్శించాలి.

దేశంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే... దాన్ని వెలికి తెచ్చి ప్రజలకు చెప్పామని తృప్తిపడి రేటింగ్ పెరిగిందనే సంస్కృతి ఉండేది. కానీ నేడు లేనిది కూడా ఉన్నట్లుగా ఏదో ఒక సంఘటన సృష్టించి దాన్ని వెలుగులోకి తెచ్చామని భుజాలు చరచుకోవడం ఎక్కువైంది. ఆ మధ్య ఓ టీవీ చానల్ ఓ చిత్రమైన షో ఏర్పాటు చేస్తే... అందులో ఒక యువకుడు తన ప్రేయసిని తలచుకుంటూ పాటను పాడాడు. ఆ యువకుడు ఉన్నత కుటుంబంలోని ఓ అమ్మాయిని ప్రేమించి ప్రేమలో విఫలమై ఆ పాటను రాసుకున్నాడని... ఆ పాటను పదే పదే ప్రసారం చేయడం... ఆ తర్వాత దాన్ని చూసిన ఓ నటుడు ఎకాఎకిన రాష్ట్రరాజధానికి వచ్చి సినిమా తీస్తానని ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి చెప్పడం.. చూసి మిగిలిన జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఓ సీరియలే రాయవచ్చు. ఛానళ్లు అనేవి విదేశాలను అనుకరించినవే... విదేశీ ఛానళ్లు ఏం ప్రోగ్రాములు చేస్తే వాటిని కాపీ చేసి మనవాళ్లు క్రియేటివ్ అని పేరు వేసుకుని చేస్తుంటారు. దాన్నే మరో ఛానల్ పేరు మార్చి ఉపయోగించుకుంటుంది. కానీ విదేశాల్లో ఇంతగా దిగజారే విలువలు లేవని మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు.

రిలయన్స్ ఘటనతో అంతా ఎలర్ట్ అయ్యారు. వాస్తవాలు ఏమైనా.. ప్రతి పార్టీకి చెందిన నాయకుడు స్పందించాడు. ఛానళ్లకు నియంత్రణ ఉండాలని. మరి వారు ఆర్థికంగా ప్రోత్సహిస్తూ.. ప్రచారానికి ఉపయోగించుకున్నంతవరకూ బాగానే ఉంది వ్యవహారం. అంతా అయిపోయాక, వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేనికైనా టైమ్ రావాలంటారు. ఒక్కోసారి ఒక్కో ఛానల్‌లో ప్రసారాలు చూస్తుంటే.. కామన్ పీపుల్‌కు పిచ్చెక్కిపోతుంది. టీవీని పగులగొట్టాలనిపిస్తుంది.

ఒకప్పుడు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఛానళ్లు నిషేధించారు. ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడకు వచ్చేసి షూట్ చేయడం... దాన్ని టెలికాస్ట్ చేయడంతో సినిమా రిలీజ్ నాటికి కొన్ని సీన్స్ చూశాక... ఇదేదో పాత సినిమా అన్నట్లు ప్రేక్షకులలో భావన రావడం జరిగింది. ఇది ఎప్పుడో చూశాం కదా... అని థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోయింది. దాంతో కలెక్షన్లకు గండిపడింది. దీంతో ఛాంబర్ కళ్లు తెరిచి... ఛానళ్లను రానివ్వద్దని హుకుం జారీ చేసింది. అది ఓ వ్యక్తికి సంబంధించిన కాబట్టి కోట్ల వ్యాపారం కనుక దానిని అడిగే హక్కు ఛానల్‌కు లేదు. కానీ రాజకీయం అంటే ప్రతివారికీ లోకువే. ప్రజాస్వామ్యంలో మేం చెప్పే హక్కు ఉందని వితండవాదం చేస్తారు ఛానల్‌వారు.

అంతేకాదు... అసలు ఛానళ్లలో ఉన్న రాజకీయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ మధ్య ఓ ఛానల్ అధిపతి సహఉద్యోగిని మోసం చేశాడు. అది బయటకు రాలేదు. అయినా ఆ అమ్మాయి వదలకపోవడంతో ఆమె శీలం మంచిది కాదనీ, బెదిరించడంతోపాటు మరో స్త్రీతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. ఇది జరిగిన సంఘటనే. ఇదే బయట జరిగితే... 24 గంటలు ప్రసారాలు చేస్తూ ఉతికి ఆరేస్తారు. సదరు వ్యక్తి నీచుడు... ఛండాలుడు అంటూ నానా రభస చేస్తారు. కానీ సదరు ఛానల్ అధిపతిని ఆ అమ్మాయి తాలూకు బంధువు వదల్లేదు. అతడిపై కత్తితో మేకులతో దాడి చేసి కసి తీర్చుకున్నాడు. అది పోలీసు కేసు కావడంతో తప్పనిసరై ప్రసారం అయింది. ఇదే కాదు... ఎన్నో ఘటనలు... కేవలం బ్లాక్ మెయిల్ ఛానల్ అని ఒకదానికి పేరుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఛానళ్ల వికృత పోకడల దృష్ట్యా భవిష్యత్‌లో మీడియాపై విప్లవం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Saturday, January 23, 2010

ముగ్గురూ.. ముగ్గురే: ఇక తెలంగాణా ఏఁవత్తది!

నాన్నేమో.. హైదరాబాద్ మాటెత్తితే నాలుకలు కోస్తాడట. అల్లుడేమో.. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని శంషాబాద్ విమానాశ్రయంలో కాలుపెట్టనీయడట. కూతురేమో.. సమైక్యాంధ్ర వాదులు నిర్మించిన చిత్రాలను అడ్డుకుంటారట". గత కొన్ని రోజులుగా పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్న వార్తలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు చేస్తున్న విద్వేషపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలే వీరి వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి.తెలంగాణ ప్రజల బతుకులు ఏవిధంగా ఉంటాయో సినీ నటి విజయశాంతి నటించిన "ఒసేయ్.. రాములమ్మ" చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు మన దర్శకనిర్మాత దాసరి నారాయణ రావు. అంతేకాదు.. సాక్షాత్ తెలంగాణ ప్రాంతానికే చెందిన విప్లవ హీరో ఆర్.నారాయణ మూర్తి స్వీయదర్శకత్వంలో నిర్మించిన పలు చిత్రాల్లో తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులనే కథా నేపథ్యంగా తీసుకుని చూపించారు.అంటే.. తెలంగాణ దొరల చెప్పుచేతల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఏవిధమైన దుర్భర జీవితం గడిపారో ఈ చిత్రాల్లోని సన్నివేశాలే నిదర్శనం. ఇలాంటి ప్రజల బతుకులు బాగు చేసుకునేందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోంది. అయితే, ఆ పార్టీకి చెందిన అధినేతతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు మరో ప్రాంతం వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయి.హైదరాబాద్ మాటెత్తితే నాలుకలు తెగ్గొస్తాం అని కేసీఆర్ అంటే.. ఆయన మేనల్లుడు హరీష్ రావు ఏకంగా.. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని శంషాబాద్ విమానాశ్రయంలో అడుడుపెట్టనీయమని హెచ్చరించారు. ఇకపోతే.. కేసీఆర్ కుమార్తె కవిత మరో అడుగు ముందుకు వేశారు. కళలకు, కళాకారులకు ఎల్లలు లేవన్నది జగమెరిగిన సత్యం. మరి.. అలాంటి కళాకారులు నటించిన చిత్రాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరికలు చేశారు.

అంటే.. వీరి డిమాండ్ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా.. వీరి పాలన ఇలాగే కొనసాగుతుందా? అనే ధర్మసందేహం సామాన్య ప్రజానీకంలో ప్రస్తుతం ఉత్పన్నమైంది. అధికారం లేకపోయినా.. తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినొస్తున్నాయి. ఇక.. నిజంగానే అధికార పగ్గాలు చేపడితే వీరి పాలన ఎలా ఉంటుందో వీరు చేస్తున్న వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయని పలువురు తెలంగాణ ప్రాంత వాసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారివల్లే అనుకున్న లక్ష్యం మధ్యలోనే నీరుగారి పోయే ప్రమాదం ఉందని ఉద్యమకారులను ప్రజలు హెచ్చరిస్తున్నారు.

రాజకీయ విభేదాల మధ్య 'ముగ్గురు మొనగాళ్ళు'

రాష్ట్ర చిత్ర పరిశ్రమలో "ముగ్గురు మొనగాళ్లు"గా చిరంజీవి బ్రదర్స్‌కు గుర్తింపు వుంది. నిన్నామొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో హీరో నాగేంద్రబాబులు తమ ఆధిపత్యాన్ని చాటుతూ వచ్చారు.అయితే, చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరంభంలో చిరంజీవికి మిగిలిన ఇద్దరు సోదరులు వెన్నుదన్నుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రజారాజ్యం పార్టీ పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ఒక్కొక్కరు వెన్ను చూపసాగారు.పార్టీ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ పూర్తిగా దూరమయ్యారు. ఆయన నేతృత్వంలోని యువరాజ్యం ఏమైందో కూడా తెలియని పరిస్థితి. ఇకపోతే.. నాగేంద్రబాబు చిత్ర నిర్మాణాల్లో పూర్తిగా మునిగిపోయారు. అడపాదడపా మాత్రమే తళుక్కున మెరుస్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు మహోధృతంగా సాగాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 15 మంది (చిరు మినహా) ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గిన చిరంజీవి తెలంగాణకు టాటా చెప్పి సమైక్యాంధ్రకు జై కొట్టారు. దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది. తెలంగాణ నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాస చెంతకు చేరారు.దీంతో "అందరివాడు"గా ఉన్న చిరంజీవి.. ప్రస్తుతం కొందరివాడుగా మారిపోయారు. దీన్ని పవన్ కళ్యాణ్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. తనను నమ్ముకుని వచ్చిన అనేక తెలంగాణ ప్రాంత అభిమానులకు ద్రోహం చేసినట్టుగా పవన్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని బయటపడలేక లోలోన కుమిలి పోతున్నారట.దీంతో తనకు నమ్మకస్తులుగా ఉన్న తెలంగాణ ప్రాంత పార్టీ నేతలు పవన్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్లగక్కారు. వారి మాటలకు చలించిన పవన్.. మీ భవిష్యత్... మీ ఇష్టం అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరేందుకు పరోక్షంగా తన సమ్మతిని తెలిపినట్టు సమాచారం.

అందువల్లే ప్రరాపా అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ తెరాస తీర్థం పుచ్చుకున్నట్టు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఈ సంఘటనతో చిరంజీవి వైఖరితో విసిగి పోయిన పవన్ కళ్యాణ్ అన్నపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల కథనం. మొత్తం మీద చిత్ర సీమలో 'ముగ్గురు మొనగాళ్లు'గా మెలిగిన చిరంజీవి బ్రదర్స్ రాజకీయాల్లో మాత్రం "ఎవరికి వారే యమునా తీరు"గా వ్యవహరిస్తున్నారు. ఇది వారి అభిమానులకు మాత్రం ఏమాత్రం మింగుడు పడటం లేదు.

Thursday, January 21, 2010

Bing to replace Google on the iPhone?



In 2003, when Apple did the unimaginable and decided to make iTunes for Windows, they ran a poster campaign saying ‘Hell Froze Over’. It looks like another Cold day in Hell (no pun intended) could be around the corner. BusinessWeek has reported that Apple and Microsoft may be in talks to close a deal that could result in Bing replacing Google as the default search engine on the iPhone. It does not end there, Bing could find its way to Safari too.
Is Apple V/S Google battle becoming more fierce?

Ever since Eric Schmidt resigned from Apple’s Board citing conflict of interest and Apple rejected the Google Voice app for iPhones, a battle has been brewing between the two tech giants. With the release of the Android OS and now the Nexus One, Google, in many ways is in direct competition with Apple. Apple is also said to be working on ways to manage the placement of ads on their mobile devices, a move which could impact Google main source of revenue, ads! With both companies now willing to tread on each others toes and hurt the other directly, this could be just the beginning of a very fierce war.

Will it really be a ‘Cold Day in Hell’ for Google?

According to mobile advertising company, AdMob, most mobile ads are viewed on Apple’s iPhone and iPod Touch. Losing the default spot will definitely result in some loss of market share in mobile search for Google. But the Google faithful are likely to switch back to Google anyway, by either using the Web or downloading the Google Search App. So while Google might not lose much directly, Apple is making its intent pretty clear. While calling it a Cold Day in Hell maybe a tad dramatic this is definitely something that Google should be wary of.

What it would to for Microsoft

According to figures released by Nielsen Co. Bing has around 11% of the mobile search market in comparison to Google’s 86%. They might definitely see some improvement in that figure. The nature of Google and Apple’s current revenue sharing model for searches on Apple devices is unknown. It is likely that Microsoft could be offering Apple a larger percentage or a higher annual fee. Unlike in 2003 when Apple needed the deal with Microsoft, this deal clearly signals that Apple now looks at Google as the Main Competition. A sign of the decreasing relevance of Big Brother? Maybe not, with a search deal already in place to add Bing to Yahoo pages. Microsoft seems destined, although inorganically, to make up some ground on Google in the search wars.

What’s in it for Apple?

Sources, close to Apple have been quoted as saying that Apple has a project to develop a search engine of its own. This deal is probably just a way to slow Google down and buy itself some time.

Well whether it is that, or a case of the two old boys ganging up on the new kid on the block, or simple economics with Microsoft offering to pay more. The Tech Wars just got more interesting!!

Wednesday, January 20, 2010

NyooTV To Offer Exclusive Online Release of "The 13th Day – An Untold Truth"

(I-Newswire) January 6, 2010 - NyooTV.com is India's first Social TV Network and one-stop shop for premium visual entertainment. Employing adaptive streaming, a revolutionary technology, NyooTV has moved visual entertainment another few giant steps along the evolutionary path. As we speak, thousands of videos are available for viewing on www.NyooTV.com. NyooTV provides premium global video content of interest to Indian consumers, whenever and wherever they want it, for FREE. This content would be available on the internet, mobile and other internet enabled devices.

NyooTV is an online and mobile video service that offers latest hit TV shows, movies and clips. Based in Philadelphia, and founded in January 2009, NyooTV is the flagship product of AKG Technologies Inc. NyooTV aggregates and offers premium Indian entertainment content across new media platforms and digital entertainment devices to Indian audiences all over the world.

Being a pioneer in its field, today NyooTV started a new trend of Movie launches - for the first time a movie would be available to the public for free on the web, the day it is being released – with the launch of “The 13th Day – An Untold Truth”. Priyanka Chopra was the Guest of Honour at the DVD Launch Event yesterday in Mumbai.

“The 13th Day – An Untold Truth”, Directed by Raajeev Walia, produced by Chand Mishra, I.M.S Reddy and Film Division of Brahma Kumaris, is an offbeat movie deals with the untold truth about what transpires between death and the 13th day (“terawheen”). This is a very spiritual and thought provoking movie.

NyooTV showcases a large compilation of videos from leading legitimate content owners. NyooTV has also partnered with leading production houses & TV Networks for television content. Users can choose from numerous primetime TV shows and latest Bollywood flicks of all genres. Viewers can pick from a wide array of popular TV shows. Users can also catch up with sports events, live shows, award ceremonies, interviews with stars, Bollywood news, trailers and clips from forthcoming films, etc.

NyooTV brings complete integration with Facebook, Myspace & Twitter (more social networks would be added in near future), enabling users to comment, share and recommend videos to their friends on all social networks. You can easily see what your friends like, what movie/show is popular and watch it right away. You can see what your friends are recommending, what they are commenting on etc. You can even chat with friends while watching an interesting video ensuring enhanced user experience – thereby making the online content watching social.

NyooTV.com promises to provide good quality, legal and unlimited content to its viewers. NyooTV’s competitive edge is the adaptive streaming technology it is running on. It will ensure great user experience because even at low bandwidth speeds it will provide high quality legitimate free content.

Monday, January 18, 2010

Website launch of my village on Pongal 2010





Ghantasala, is a town and Mandal headquarters in Krishna district of Andhra Pradesh, India. It is 21 km west of Machilipatnam and 11km east of river krishna. It is a rare and reputed center for Buddhist sculptures. There is a temple for Lord shiva named as JALADHEESWARA SWAMY temple which was built by devathas and is called as chinna kasi. In this temple lord Shiva and goddess Parvathi are placed on the same peetham. Now Ghantasala has its own museum which contains some of the important Buddhist stupa and sculptural slabs found in recent years. The Andhra Pradesh Government recognizes this village as one of the tourist centres. Some of the carved slabs have found their way to museums in Paris and London.

On the occasion of 2010 Sankranti (Pongal) few of my friends from my native had inaugurated a function to launch an website on the name of my village. Mr. Ranganath Babu from US had, launched the website and my father taken the lead to organize the function with nice comments and Joy.

To know more about my village check http://www.managhantasala.net

Monday, January 11, 2010

అందరు ఒక సరి ఆలోచించండి

ఎవరి ఇష్టం వోచినట్టు వాళ్ళు మాట్లాడుకునే హక్కు అందరికి ఉంది. అంతే కానీ తెలంగాణా కి సపోర్ట్ ఇవ్వక పొతే సినిమా అడనివ్వం, పండుగకి ఇంటికి వెళ్ళిన వాళ్ళని వెనక్కి రానివ్వం అనడం సరికాదు. ఉద్యమం చేయడానికి ఒక పద్దతి ఉండాలి అంతే కానీ బుసలు తగుల బెట్టి, సినమా లు ఆపేసి గొడవ చేస్తే తెలంగాణా వస్తుంది అనుకుంటే బ్రమే అవుతుంది. ఉద్యమం అంటే హింస కాదు, హింసే మార్గం అనుకుంటే అనుకున్న పని ఎప్పటికి కద్దు. హింస వాళ్ళ జరిగే నష్టానికి మరల మనమే బాద్యత వహించాలిసి వస్తుంది.

ఉద్యమం చేసుకునే హక్కు అందరిది కాని అది చేసే విదానం మారాలి. కొట్టి, బెదిరించి చేసే ఉద్యమానికి శాశ్విత పరిష్కారం ఉండదు. బలం సంపాదించడం అంటే బయపెట్టడం కాదు. ముందు మనం చేసిది తప్పు కాదో తెలుసుకోవాలి. జనం అంట చూస్తున్నారు, మనం ఏది చేసిన చెల్లు అనుకుంటే తప్పు.

ఉద్యమం చేయండి అది ఎవరినో బయ పెట్టడానికో, ఏదో నష్ట పరచాదనికో మాత్రం అయితే మాత్రం వొద్దు. అలా చేసిన ఉద్యమానికి ఏమి కాదు ఏమి రాదు. పండుగ నాడు అందరి ఆనందం కోసం వచ్చే సినిమా ని ఆపడం గొడవ చేయటం దానికి ఏదో కారణం చెప్పడం అవివేకం. కుటుంబం లో అందరు ఒకే పార్టీ కి ఒకే ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వాలి అనడం లేక పొతే బెదిరించడం మన సంస్కృతీ కాదు. అందరం పండుగని బాగా జరుపుకుందాం. మన వినోదం కోసం కోట్లు పెట్టి తీసిన సినిమా ని ఈ చిల్లర రాజకియ్యాల కోసం బలి చేయడం ఎంత వరకు బావ్యం?

తెలంగాణా రాకుండానే నాలుకలు కోసేస్తం, ఎయిర్ పోర్టులో దిగనియ్యం, సినిమాలు కొనొద్దు అంటే ఇక తెలంగాణా వస్తే? అందరు ఒక సరి ఆలోచించండి






Tuesday, January 5, 2010

తెలంగాణ ఉద్యమ స్వరూపంతో మారిన కేంద్ర వైఖరి!

హింసాయుత తెలంగాణ ఉద్యమ స్వరూపంతో కేంద్ర వైఖరి మార్చుకుంది. ఫలితంగా రాష్ట్రంలోని ఎనిమిది గుర్తింపు పొందిన పార్టీలను న్యూఢిల్లీకి ఆహ్వానించి శాంతి మంత్రం జపించేలా చేసింది. శాంతిభద్రతల పరిరక్షణపై పూర్తి బాధ్యతను రాష్ట్ర రాజకీయ పార్టీలపై పెట్టింది. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడని పక్షంలో తామే రంగంలోకి దిగుతామని చిదంబరం చెప్పకనే చెప్పారు.

తెలంగాణపై కేంద్ర ప్రకటన వెలువడటంతోనే సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది. వీరిని శాంతి పరిచేందుకు కేంద్రం మరో ప్రకటన చేసింది. దీంతో అప్పటి వరకు శాంతియుతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమ స్వరూపం ఒక్కసారి తన రూపురేఖలను మార్చుకుంది. ఆ తర్వాత మరో ప్రకటన చేయాల్సి వచ్చింది.

ఈ నెల 5వ తేదీన రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చిదంబరం ప్రకటించారు. ఈ ప్రకటన తెలంగాణ ఉద్యమకారుల్లో మరింత ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా తెలంగాణలో జరిగిన ఉద్యమం, మారిన తెలంగాణా వాదుల వ్యవహారశైలిని కేంద్ర నిఘా వర్గాలతో పాటు రక్షణ శాఖ నిఘా వర్గాలు, రాష్ట్ర గవర్నర్‌లు కేంద్రం దృష్టికి తెచ్చాయి.

భాషా ప్రయోగంలో మార్పొచ్చింది. హింసావాదం చోటు చేసుకుంది. మావోయిస్టులు తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించారు. రక్తపాతం ద్వారానే రాష్ట్రసాధన సాధ్యపడుతుందని పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల స్వయంగా మీడియా ముందుకు వచ్చిన మద్దతు ప్రకటించారు. ఉద్యమంలోకి అసాంఘిక శక్తుల ప్రవేశం కూడా జరిగిందన్న కేంద్ర అనుమానాలకు ఇది మరింత బలం చేకూర్చింది. ఇదంతా కేవలం ఐదారు రోజుల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం.

దీంతో కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఉద్యమాన్ని రాజకీయ దృష్టి కంటే శాంతిభద్రతల దృష్టితో చూడాలనే నిర్ణయానికి వచ్చింది. తన తొలి ప్రకటనను సవరించుకునే దిశగా ప్రయత్నించింది. ప్రత్యేకవాదంపై తన అభిప్రాయాన్ని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పునరుద్ధరణపై మనస్సు లగ్నం చేసింది. వీటి ఫలితమే మంగళవారం కేంద్ర అఖిలపక్షంతో జరిపిన చర్చల ఫలిత సారాంశం.

ఈ చర్చలకు ముందు అంటే.. ఐదురోజుల పాటు తెలంగాణా ఉద్యమకారులు సంయమనం పాటించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నిఘా వర్గాల ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటికే రాష్ట్ర విభజనపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చింది కూడా.

ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో నివశిస్తున్న ఆంధ్రా, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను తెలుసుకునే ప్రయత్నం చేసి వారికి తమ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదన్న భరోసాను తెలంగాణ ఉద్యమకారులు కల్పించడంలో విఫలమయ్యారు. ఇదే సాధించి ఉంటే.. తెలంగాణా రాష్ట్ర సాధన ప్రయత్నం మరో అడుగు ముందుకు పడివుండేది.

ప్రస్తుత పరిస్థితుల్లో అటు కేంద్రంతో పాటు.. జాతీయ స్థాయిలోని పలు పార్టీలో తెలంగాణ అంశంలో తమ వైఖరిని మార్చుకుంటున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యతను మంగళవారం నాటి సమావేశంలో చిదంబరం పదేపదే నొక్కి చెప్పారు.

ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలు కూడా శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకట్రెండు పార్టీలైతే ఏకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాయి. కేంద్ర విజ్ఞప్తి తర్వాత కూడా శాంతిభద్రతలు చక్కబడని పక్షంలో ప్రత్యక్ష చర్యలకు సైతం దిగే అవకాశాలు లేకపోలేదని చిదంబరం వ్యవహరిస్తున్న వైఖరి తేటతెల్లం చేస్తోంది.

Entertainment at my time NOT just prime time!

Monday, January 4, 2010

People are laughing At Telugus

The Telangana issue became joke for many non-Telugus such as Marathis, Punjabis, Gujarathis who are living in Hyderabad and other parts of India are having hearty laugh over the crisis. They are saying that usually Telugus keep fighting for their identity since they are addressed as ‘Madrasis’ but now what happened to their pride? They asked.

Friends who are calling from other states laughing uncontrollably, and they are saying we never seen such idiots like us who are simply shaking heads for whatever the politicians are saying. And everyone saying that if the current scene continoues, Andhra will become worse than Bihar.

Pople who are working in S/W Companies are facing the same pain. Now the people from different places are are not able to look into the eye of their friends. Everything was so nice when they used to meet but now thes issue is creating sensitive feelings. Everyones heart feeling is "If god is there, I pray that all those who are creating this ruckus must pay for it and the heartburn they have created; they will die a dog’s death”.

While states like Tamilnadu, Karnataka are having a feast with development and progress, it is really depressing to see that our Telugu land is getting torn into pieces due to a rogue fanatic and these are the times when one must reflect not as an individual but someone who is part of this Telugu history.

Saturday, January 2, 2010

ఆంధ్రప్రదేశ్‌‌ను పీడిస్తున్న ఆందోళనల భూతం

గత నెలరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు రాష్ట్రాన్ని ఆందోళనల భూతం పట్టి పీడిస్తోందా... అనిపిస్తుంది. మొత్తమ్మీద ఈ సుడిలో సామాన్యుని జీవితం దుర్భరమైపోతుంది. రాష్ట్రంలోని రవాణా దాదాపు స్తంభించిపోయిందనే చెప్పాలి. దీంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్రంలో బంద్‌లు, ఆందోళనల వల్ల కలిగిన నష్టం అపారమైనదిగా, మాంద్యం తెచ్చిన నష్టాన్ని సైతం అధిగమించి రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలను చైతన్యపరిచి ఆందోళనలను విరమింప చేయాల్సిన నాయకులే వాటిని ఎగదోసే రీతిలో ప్రవర్తించడం విచారకరమని వారు అంటున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రజా వనరులతో పనిచేస్తున్న పరిశ్రమలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఉన్న ఆర్డర్లను సమయానికి అందించకపోవడంతో రావాల్సిన పనులు చేతికి రావడం లేదు. మొత్తమ్మీద సగటు ఉద్యోగి బితుకుబితుకుమని కాలం వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగికి ఢోకా లేకపోయినా ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్ డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

రాజకీయ నిరుద్యోగులే ఉద్యమాలకు మూలం

రాజకీయ రంగంలో నిరుద్యోగం ఎక్కువై పదవులు లేనపుడే ఏదో ఒక రూపేణా కొన్ని ఉద్యమాలు పుట్టుక వస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఉద్యమాలను కేవలం వారు తమ పునరావాసం కోసం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారని అంటున్నారు. అటువంటి ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయంటున్నారు.

మన రాష్ట్రం సంగతినే తీసుకుంటే... ఒకప్పుడు చెన్నారెడ్డి రాజకీయ నిరుద్యోగంలో ఉండగా ఉద్యమాలు లేపి తెలంగాణా వాదాన్ని ముందుకు తెచ్చారు. ఆయనకు పదవులు ఇవ్వగానే ఆ ఉద్యమం చల్లారిపోయింది. అదే చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పడు వైఎస్ కొంతమందిని ఉసిగొల్పారని చెపుతున్నారు. నాటి అల్లర్లలో దాదాపు 350మంది విద్యార్థులు చనిపోయారు. మరి తెలంగాణా రావాలంటే అప్పుడే రావాలి కదా. ఎందుకు రాలేదంటే.. అది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే కనిపిస్తుందంటున్నారు.

ఆ తర్వాత మల్లిఖార్జునరావు, అంజయ్యలకు పదవులు వచ్చాయి. తర్వాత వెంకటస్వామికి సైతం పదవి దక్కింది. వీరంతా 30 ఏళ్లుగా ఎందు ఉద్యమాలు చేయకుండా మిన్నకున్నారు...? అంటే.. తమకు రాజకీయంగా పదవులు లభించినపుడు వారంతా నిశ్శబ్దాన్ని పాటించినట్లు అవగతమవుతుంది.

ఇక ఇటీవల వెంకటస్వామికి అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం వల్లనే ప్రత్యేక తెలంగాణా అంటూ ముందుకు వచ్చారని అంటున్నారు. అలాగే జీవన్ రెడ్డి, కేసీఆర్‌లకు అప్పడు తెలంగాణా ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా రాజకీయంగా నిరుద్యోగంతో బాధపడుతూ... పదవీవ్యామోహంతో ప్రజలతో ఆడుకుంటున్న చదరంగం తప్ప మరేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి ఇవన్నీ సామాన్యుడికి అవసరం లేదు. వారికి నిత్యావసర సరుకులు కావాలి. కందిపప్పు, బియ్యం, మంచినీళ్లు కావాలి... అంటారే తప్పించి రాష్ట్ర విడిపోనిదే మాకు ముద్ద దిగదు అని ఎవ్వరూ అనరు. ప్రస్తుత పరిస్థితిలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం దాదాపు శూన్యంగానే అనుకోవచ్చు.

ఈ నేపధ్యంలో నేరుగా రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు గల మార్గాలను అన్వేషించి, ఆ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. లేదంటే మొత్తంగా అసెంబ్లీని రద్దుచేసి తిరిగి ఎన్నికలు నిర్వహించి తెలంగాణాపై రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు ఎటువంటి తీర్పు చెపుతారో దానిప్రకారం నడుచుకుంటే ఎటువంటి గొడవా ఉండదని చెపుతున్నారు

Friday, January 1, 2010